Post on 2024-01-31
ప్రేక్షకులు సినిమాను చూసి విజయవంతం చేయాలి.. ‘ధీర’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు
వలయం, గ్యాంగ్స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత ‘ధీర’ అనే సినిమాతో లక్ష్ చదలవాడ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి.
ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో దిల్ రాజు, గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన సినిమా బిగ్ టికెట్ను లాంచ్ చేశారు. అనంతరం ఈవెంట్లో